6 July, 2026 | 4:22 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

నా చివరి శ్వాసవరకు ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తా

06-05-2026 02:33 AM

గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేని పనులు రెండున్నర ఏండ్లలో చేశాం

అది జీర్ణించుకోలేక గుంపుగా విమర్శలు చేస్తుండ్రు

ప్రభుత్వ విప్ బిర్ల  ఐలయ్య

ప్రజల సంక్షేమం కోసం చివరి శ్వాస వరకు పనిచేస్తానని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ ప్రభుత్వ పథకాల అమలును వివరించారు.

యాదగిరిగుట్ట, మే 5: ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని, చివరి శ్వాస వరకు అదే దిశగా పనిచేస్తానని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నానని ఆయన తెలిపారు.

“నా మీద చేస్తున్న విమర్శలు నాకు పూలమాలలాంటివి” అని ఆయన వ్యాఖ్యానించారు.

తాజా ప్రభుత్వ పథకాల వివరాల కోసం విజయక్రాంతి న్యూస్‌ క్లిక్ చేయండి.

మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఐలయ్య, గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పది సంవత్సరాల్లో చేయలేని పనులను ప్రస్తుత ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల్లోనే పూర్తి చేసిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతోందని అన్నారు.

ఇదిలా ఉంటే, ప్రతిపక్ష పార్టీలపై కూడా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. తమపై విమర్శలు చేయడం ద్వారా రాజకీయ లాభం పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా కొందరు నాయకులు వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని తెలిపారు.

“ఎన్నికల సమయంలో ప్రజలే తీర్పు ఇస్తారు” అని ఆయన సవాల్ విసిరారు."

రాబోయే ఎన్నికల్లో పలువురు నాయకులు తనపై పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని, ప్రజాక్షేత్రంలో వారిని ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతో మళ్లీ విజయం సాధిస్తానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

తాజా ప్రభుత్వ పథకాల వివరాల కోసం తెలంగాణ వార్తలు ను క్లిక్ చేయండి.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి కూడా ఆయన వివరించారు. ప్రజా పాలనలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం, పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.

రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ, రైతు బంధు, రైతు భీమా, ఎరువుల సరఫరా వంటి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అదేవిధంగా పేదలకు ఇండ్లు నిర్మించడం, ప్రతి మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు.

“ఇన్ని పథకాలు అమలు చేస్తున్నా కూడా విమర్శలు చేయడం సరైంది కాదు” అని ఆయన అభిప్రాయపడ్డారు."

ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించిన ఐలయ్య, చిల్లర రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. ప్రజల అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, పలువురు కౌన్సిలర్లు మరియు నాయకులు పాల్గొన్నారు.