4 April, 2026 | 9:35 PM

Breaking News

ఆస్తిపన్ను చెల్లింపులపై 5 శాతం రాయితీ: డిప్యూటీ కమిషనర్ వాణి   •   14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం   •   రైతును రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం   •   కలెక్టర్ చొరవతో కుటుంబ సభ్యులను కలిసిన వ్యక్తి   •   ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు సరికాదు   •   భావితరాలకు సంస్కృతి సంప్రదాయాలను తెలిపేది భగవద్గీత   •   సజ్జన్‌పల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం   •   చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో 14వ పట్టభద్రుల దినోత్సవం ఘనంగా   •   సుజాత ఇంటర్నేషనల్ స్కూల్‌పై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం   •   క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీ   •  

మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చైర్మన్ బండారు

04-04-2026 07:35 PM

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): శనివారం సాయంత్రం మధిర మార్కెట్ యాడ్ నందు పిఎసిఎస్ మధిర ఆధ్వర్యంలో మధిర మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాతతో కలిసి మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు చేతుల మీదుగా ప్రారంభించినారు.

అనంతరం చైర్మన్ బండారు మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన మాటకు కట్టుబడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుందన్నారు.