11 May, 2026 | 10:49 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

07-01-2026 12:51 AM

అశ్వాపురం, జనవరి 6 (విజయక్రాంతి): అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన కనుకు సరస్వతి (21) హైదరాబాద్ ఎల్బీనగర్ సమీపంలోని ప్రభుత్వ వసతి గృహంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ నెల 4వ తేదీ ఆదివారం సాయంత్రం సరస్వతి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత ఏడాది కాలంగా హైదరాబాద్ ఎల్బీనగర్లో కంప్యూటర్ కోచింగ్కు వెళ్తున్న సరస్వతి, ఇటీవల ఓ ప్రైవేట్ కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అశ్వాపురం గ్రామానికి చెందిన పాలడుగు నందకిషోర్ అనే యువకుడితో ఆమె కొంతకాలంగా ప్రేమ సంబంధం కొనసాగిస్తున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

సరస్వతి మృతికి నందకిషోరే కారణమని ఆరోపిస్తూ మంగళవారం మృతురాలి కుటుంబ సభ్యులు అశ్వాపురం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి ప్రధాన రహదారిపై సుమారు గంటపాటు ఆందోళన చేపట్టారు. అనంతరం నందకిషోర్ స్వగ్రామంలో అతడు నిర్మిస్తున్న ఇంటి ముందు మృతదేహంతో నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాల కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. మధ్యవర్తుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి రావడంతో ఆందోళనను విరమించారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.