11 May, 2026 | 11:56 AM

Breaking News

యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •   అర్ధరాత్రి అమానుషం.. పోలీస్ కానిస్టేబుల్ హత్య   •   ORRపై రోడ్డు ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు   •  

తపాలా శాఖ పథకాలను వినియోగించుకోవాలి

24-01-2026 08:57 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీములను ప్రజలు వినియోగించుకోవాలని తపాలా శాఖ పాల్వంచ సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ మాలోత్ వీరన్న కోరారు. శనివారం ఆయన ములకలపల్లి లోని సబ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. వివిధ రికార్డులను పరిశీలించారు. ఈ ఆర్థిక సంవత్సరం సాధించిన వివిధ రకాల పథకాలకు సంబంధించిన పురోగతిని ఆయన సమీక్షించారు. పోస్టల్ శాఖ అందించే వివిధ రకాల జీవిత బీమా పథకాలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.

కార్యాలయ సిబ్బంది ఉత్తరాల బట్వాడకు వెళ్లిన సమయంలో తపాలా శాఖ అందించే పథకాలను వివరించి గ్రామస్తులు పోస్ట్ ఆఫీస్ లల్లో ఖాతాలను ప్రారంభించే విధంగా చూడాలని వారికి అవగాహన కల్పించారు. అలాగే కమలాపురం గ్రామంలో సర్పంచ్ వగ్గేల రాధ ఆధ్వర్యంలో పోస్టల్ శాఖ అందించే వివిధ పథకాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామీణ పేదలు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన, సుకన్య యోజన, ప్రమాద బీమా తదితర పథాకలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ములకలపల్లి సబ్ పోస్ట్ మాస్టర్ కిరణ్ కుమార్, కమలాపురం పోస్టు మాస్టర్ రేపాక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.