అన్ని కులాల సంక్షేమానికి కృషి
నిర్మల్ మున్సిపల్ వైస్చైర్మన్ గణేష్ చక్రవర్తి
నిర్మల్, ఫిబ్రవరి ౨౩ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని అన్ని కులాల అభివృద్ధికి అండగా ఉంటానని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి అన్నారు. సోమవారం కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమం హాజరయ్యారు. అన్ని కులాల సామాజిక వర్గాల మద్దతుతోని తాను విజయం సాధించాలని వారికి అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఇటీవలే జరిగిన నిర్మల్ మున్సిపల్ ఎన్నికలలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్గా ఎంపి ఎన్నికైన శ్రీమతి శ్రీ అప్పల కావ్య గణేష్, కౌన్సిలర్ గోపు గోపినాథ్, ఈ కార్యక్రమంలో కుమ్మరి నిర్మల్ పట్టణ సంఘం నిర్మల్ పట్టణ అధ్యక్షులు కొత్తపల్లి రఘు, కోశాధికారి తోడిశెట్టి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు రాజారావు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




