7 May, 2026 | 3:11 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

ఈహెచ్‌ఎస్‌కు జీతాల్లో కటింగేంటి?

26-02-2026 12:26 AM
  1. ఇప్పటికే సీపీఎస్ కోసం 10 శాతం.. మళ్లీ 1.5శాతం కోతనా..?
  2. సీఎస్‌కు సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ వినతి

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): నూతన ఈహెచ్‌ఎస్ స్కీంకు తమ జీతాల నుంచి 1.5 శాతం చందా కట్ చేయడం దారుణమని సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ తెలిపారు. ఈ మేరకు సీఎస్‌ను బుధవారం కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. అసలే సీపీఎస్ స్కీంతో రిటైర్‌మెంట్ తర్వాత వచ్చే నామమాత్రపు పెన్షన్‌తో వృద్ధాప్యంలో పూటగడవడమే తమకు కష్టంగా మారిందని, ఇలాంటి దుస్థితిలో తమకు ఉచిత ఆరోగ్య భద్రత కల్పించకుండా తమ జీతా ల నుంచి కట్ చేయడం సరైంది కాదన్నారు.

ఇప్పటికే సీపీఎస్ కోసం పది శాతం కోత విధిస్తున్నారన్నారు. ఉద్యోగవిరమణ పొందిన తర్వాత కూడా ఉచిత ఆరోగ్య భీమా సదుపాయం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగులతో చర్చలు జరిపే జాయిం ట్ స్టాఫ్ కౌన్సిల్‌లో ఒక్కరు కూడా సీపీఎస్ సం ఘం నుంచి ప్రతినిధి లేకపోవడం బాధాకరమన్నారు. తమ డిమాండ్లకు అనుగుణంగా ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేయాలనిన్నారు. నా యకులు కల్వల్ శ్రీకాంత్, నరేష్‌గౌడ్ పాల్గొన్నారు.