12-02-2026 12:00:00 AM
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
వాంకిడి, ఫిబ్రవరి 10(విజయక్రాంతి):ఆలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. మంగళవారం మం డలంలోని సరాండి గ్రామంలో నూతనంగా నిర్మిం చిన శ్రీ భక్త ఆంజనేయ (హనుమాన్) దేవాలయా న్ని ఆమె ప్రారంభించి గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ భక్తి, శ్రద్ధలను అలవర్చుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు అజ య్ కుమార్, మాజీ సింగిల్ విండో చైర్మన్ జబరి పెంటు, సరాండి సర్పంచ్ బాపూజీ, గ్రామ పటేల్ కొట్రంగే మెంగాజీ, మాలి సంఘం జిల్లా అధ్యక్షుడు శిండే వాసు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణ, గౌరయ్య పటేల్, మాజీ సర్పంచ్ దుర్గం కమలాకర్తోపాటు గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.