28 August, 2026 | 1:52 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

కూరల నాణ్యతలో నిర్లక్ష్యం సహించం

01-07-2026 01:13 AM

కలెక్టర్ హైమావతి 

సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 30: మధ్యాహ్న భోజనంలో కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా అమలు చేసి, విద్యార్థులకు రుచికరంగా, కడుపునిండా భోజనం వడ్డించాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి ప్రధానోపాధ్యాయులు, సిబ్బందిని  ఆదేశించారు. మంగళవారం చిన్నకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి భోజన నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, మెనూ అమలు, ఆహార నాణ్యతపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కూరల నాణ్యతలో నిర్లక్ష్యం సహించబోమని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఓపీ, హాజరు రిజిస్టర్లను పరిశీలించారు.