26 May, 2026 | 7:07 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం

13-10-2025 07:05 PM

రైతుల క్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి..

వలిగొండ (విజయక్రాంతి): తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతుల క్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం వలిగొండ మండలంలోని నాగారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో వలిగొండ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా అత్యధిక వర్షం కురిసిందని అన్నారు. గడిచిన ధాన్యం విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అధికారులు రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందించి ధాన్యం తడవకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శేఖర్ రెడ్డి, తహసిల్దార్ దశరథ, ఎంపీడీవో జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.