11 May, 2026 | 11:56 AM

Breaking News

యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •   అర్ధరాత్రి అమానుషం.. పోలీస్ కానిస్టేబుల్ హత్య   •   ORRపై రోడ్డు ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు   •  

పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి

29-11-2025 12:00 AM

పార్టీశ్రేణులకు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి దిశానిర్దేశం

మానకొండూరు, నవంబరు, 28( విజయక్రాంతి):గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీశ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం ఎల్‌ఎండీ కాలనీలో జరిగిన పార్టీ ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహ లు, ప్రచార కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించడం తదితర అంశాలపై ఆయన పార్టీ శ్రేణులతో చర్చించారు.ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేస్తే గెలుపు సాధ్యమన్నారు.

పంతాలు, పట్టింపులకు పోకుండా పంచాయతీల్లో పట్టు సాధించడంపైననే దృష్టి సారించడమే కాకుండా ఆ దిశగా కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే నాయకులకు,కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రభుత్వ పథకాల గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి ఇంటింటా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు.

ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, తిమ్మాపూర్, గన్నేరువరం మండల పార్టీ అధ్యక్షులు బండారి రమేశ్, ముస్కు ఉపేందర్ రెడ్డి, పార్టీ నాయకులు మోరపల్లి రమణారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, శ్రీగిరి రంగారావు, గోపు మల్లారెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, మామిడి అనిల్ కుమార్, ఎస్.కొండల్ రావు, కొత్త తిరుపతిరెడ్డి, గోగూరి నర్సింహారెడ్డి, పోలు రాము,రమేశ్, మాతంగి అనిల్, బొడ్డు సునిల్, రవీందర్ రావు, శ్రీధర్ రెడ్డి, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, నాగిశెట్టి రాజయ్య, దూలం వీరస్వామి గౌడ్, ఒడ్నాల నర్సయ్య, కె.రాంప్రసాద్,బుర్ర శ్రీకాంత్ గౌడ్ తదితరులుపాల్గొన్నారు.