22 May, 2026 | 9:29 PM

Breaking News

సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •  

నేరాలు నియంత్రణకు సహకరించాలి...

27-11-2025 07:51 PM

పోలీస్ అవగాహన సదస్సులో సీఐ ధనంజయ గౌడ్..

ఉప్పల్ (విజయక్రాంతి): నేరాలు నియంత్రణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని నాచారం ఇన్స్పెక్టర్ ధనంజయ గౌడ్ అన్నారు. మల్లాపూర్ చాణిక్యపురి నగర్ కాలనీలో నాచారం పోలీస్ స్టేషన్ అడ్మిన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య నేతృత్వంలో గురువారం నిర్వహించిన పోలీస్ అవగాహన సదస్సులో సిఐ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేరాలు నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు కాలనీవాసులకు వివరించారు. ప్రధానంగా నేరాల నియంత్రణకు తమ ఇంటి పరిసర ప్రాంతంలో సెంట్రల్ లాకింగ్ సిస్టం అమర్చుకోవడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.

అపరిచిత వ్యక్తులు నుండి చరవాణి కు వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు లావాదేవీల సంబంధించిన ఎలాంటి ఓటిపిలు షేర్ చేయొద్దని ఆయన పేర్కొన్నారు.  బంగారం తస్కరించే ముఠాల పట్ల మహిళలు జాగ్రత్త వహించాలని బంగారు ఆభరణాలు ధరించి వెళ్లే ముందు అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా కనపడితే వెంటనే స్థానిక పోలీసులకు  సమాచార ఇవ్వాలని అని కోరారు. యువత మారకద్రవలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని యువతకు సూచించారు. ఇంటి యజమానులు ఇళ్లను అద్దెకిచ్చేముందు అద్దెకు తీసుకున్న వాలి పూర్తి సమాచారం ఆధార్ కార్డులు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాచారం పోలీస్ స్టేషన్ సిబ్బంది కాలనీవాసులు పాల్గొన్నారు.