22 May, 2026 | 10:26 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

వడదెబ్బతో వ్యక్తి మృతి

22-05-2026 09:13 PM

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డుకు చెందిన సుంచు శ్రీనివాస్(58) వడదెబ్బకు గురై శుక్రవారం  మృతి చెందిన సంఘటన యాదగిరిగుట్టలో చోటుచేసుకుంది. పాత గుట్ట ఆలయానికి వెళ్లే దారిలో ఒక చిన్న రేకుల షెడ్డులో ఆయన ఒక దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో వడగాలులు ఎండల తీవ్రతకు రెకుల షెడ్డు వేడికి ఆయన తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు.

గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉండడంతో పాటుగా తీవ్రమైన ఎండలతో వడదెబ్బ తగిలి ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురై సోమసిలి పడిపోయారు. దీంతో అక్కడున్నవారు గమనించి ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనను పరిశీలించిన అనంతరం మృతి చెందినట్లు ధృవీకరించారు.తీవ్రమైన ఎండలతో వడదెబ్బకు గురై 58 సంవత్సరాల వయసుగల  సుంచు శ్రీనివాస్ మృతి చెందినట్లు వారు తెలిపారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అధికారులు తగిన విధంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు