4 May, 2026 | 3:15 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

24-01-2026 12:18 AM

నూతనకల్  జనవరి 23 : 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ, యువకులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని దేశ పౌరుడిగా ఓటు హక్కు కలిగి ఉండడం గర్వకారణం అని ఆయన అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాములు నాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.