11 April, 2026 | 4:20 PM

పంటకు ట్యాంకరుతో నీరు

11-04-2026 02:17 PM

జనగామ, (విజయక్రాంతి): చెరువులు, కుంటల్లో నీరుందని, బోర్లు బాగానే పోస్తున్నాయని, యాసంగి గట్టెక్కుతామన్న ధీమాతో ఉన్న రైతన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటిని అందించాల్సి వస్తోంది.  జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంక్సాపూర్ గ్రామానికి చెందిన రైతు సంగెం కొమురెల్లి రెండు ఎకరాలలో వరి పంట వేశాడు.

పంట చేతికొచ్చే సమయంలో భూగర్భ జలాలు అడుగంటి బోరు బందయింది. పంట పొట్టదశలో ఉండటంతో చూస్తూ ఊరుకోలేక నీటి ట్యాంకర్లను గత నెల రోజుల నుండి  రోజు కి వెయ్యి రూపాయల చొప్పున అద్దెకు తీసుకొని. దానితో పొలం తడుపుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పు చేసి పెట్టుబడి పెట్టినప్పటికీ, సాగునీరు లేక పంట ఎండిపోయేలా ఉందని ఆయన తెలిపారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.