26 June, 2026 | 9:55 PM

నాటుసారా తయారీకి వినియోగించే నల్లబెల్లం స్వాధీనం

26-06-2026 09:09 PM

నాగర్‌ కర్నూల్,(విజటాక్రాంతి): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆబ్కారీ డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి, జిల్లా ఆబ్కారీ అధికారి వి. వేణుగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం నాగర్‌ కర్నూల్ ఆబ్కారీ అధికారులు దాడులు నిర్వహించారు. తాడూర్ మండలం పాపగల్ గ్రామానికి చెందిన ఎం.డి. అన్వర్ కిరాణా దుకాణంలో తనిఖీలు నిర్వహించగా, నాటుసారా తయారీకి వినియోగించే 600 కిలోల నల్లబెల్లం, 50 కిలోల నవసాగరం, పటిక స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఎం.డి. అన్వర్‌పై కేసు నమోదు చేసినట్లు అబ్కారీ సీఐ కళ్యాణ్ తెలిపారు. ఈ దాడిలో ఎస్‌ఐలు చిన్న రాములు, నవీన్ రెడ్డి, సిబ్బంది బంతిలాల్, నిరంజన్, సత్యనారాయణ గౌడ్, అరుణ్ కుమార్, దయాకర్, మౌనిక పాల్గొన్నారు.