రసాభాసగా మారిన వార్డు సభ సమావేశాలు
08-06-2026 05:44 PM
రామాయంపేట,(విజయ క్రాంతి): రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 8, 9 వార్డులలో సోమవారం వార్డు సభలు నిర్వహించడం జరిగింది. ఈ సభలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజల చెవులో పూలు పెట్టిన విధంగా ఉన్నాయని బిఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఇక్కడ కూడా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో పాటు పట్టణంలో కూడా అదేవిధంగా చేస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. స్పందించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అభ్యంతర వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అసమర్థత కారణంగా తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడిందని అప్పటి నాయకుల అవినీతి అసమర్థత పాలన వల్లే నేడు ఈ ఆర్థిక దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు.






