11 July, 2026 | 2:44 PM

ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

11-07-2026 01:45 PM

అచ్చంపేట : టనాగర్‌ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ శనివారం పరిశీలించారు. ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తిచేయాలని, అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా, అనర్హుల ఓట్లు జాబితాలో ఉండకుండా అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతి బీఎల్‌వో రోజుకు 60 మంది ఓటర్ల వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు మాత్రమే ఉండాలని, డీఎస్‌ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా డూప్లికేట్ ఓట్లను గుర్తిస్తున్నామన్నారు. రెండు,  అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటరుగా నమోదు కావడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు.