గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా ‘వెన్నం’ నియామకం
07-05-2026 12:00 AM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా వెన్నం శ్రీకాంత్ రెడ్డి ని ప్రభుత్వం నియమించింది. మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన శ్రీకాంత్ రెడ్డి కి జిల్లా స్థాయి నామినేటెడ్ పదవి ఇవ్వడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.






