18 April, 2026 | 12:23 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

వసంత పంచమి.. చిన్నారులకు అక్షరాభ్యాసం

23-01-2026 06:14 PM

అచ్చంపేట: వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం చేసిన చిన్నారులు త్వరగా చదువు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని అర్చకులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం అచ్చంపేటలోని సీతరాళ్లగుట్ట సరస్వతిదేవి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా పద్మశాలి మహిళ సంఘం అధ్యక్షురాలు దాసపత్రి శకుంతల ఆధ్వర్యంలో సరస్వతి మాతకు అభిషేక  పూజలు నిర్వహించారు. అమ్మవారికి 25 రకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పించారు. ఆలయ అర్చకులు చిదంబర శాస్ర్తి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.

ఈ సందర్భంగా శకుంతల మాట్లాడుతూ మాఘమాసం శుక్ల పక్షం.. వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారుల నాలుకపై అమ్మవారు నిలిచి విద్యను త్వరగా నేర్చుకోవడానికి మనసులో నిలిచి ఉండడానికి ఆశీర్వదిస్తుందని అన్నారు. పద్మశాలి సంఘం అధ్యక్షులు కోట కిషోర్ పూజలో పాల్గొన్న వారికి పెన్నులు అందజేశారు. కార్యక్రమంలో గుర్రం హైమావతి, గంజి నిర్మల, కోట ప్రశాంతి, ఇమ్మడి రాజేశ్వరి, దాసు జంగమ్మ, బాలకిష్టమ్మ, నారాయణమ్మ, పద్మ, శ్రీదేవి, బాలమణి, మానస, సావిత్రి, దాసు శ్రీనివాసులు, వనం వేణు, రంగ రాజు, మాకం శేఖర్ లు పాల్గొన్నారు.