30 May, 2026 | 9:31 PM

Breaking News

రికార్డు స్థాయిలో పంట కొనుగోలు   •   బిఆర్ఎస్ కార్యకర్త రెండు కాళ్లు కోల్పోవడంతో పరామర్శించిన మాజీ మంత్రి,మాజీ ఎమ్మెల్యేలు   •   బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందాలి   •   రైతులకు చట్టబద్ధమైన మద్దతు ధర కల్పించాలని డిమాండ్   •   ఎలికట్ట చౌరస్తాలో గంజాయి విక్రేత అరెస్ట్.. కిలో గంజాయి స్వాధీనం   •   పొగాకుకు దూరంగా ఉండండి - ఆరోగ్యాన్ని కాపాడుకోండి   •   నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు: సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు   •   ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలి   •   ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ రాష్ట్రానికి మొదటి స్థానం   •   సత్యనారాయణపురం గ్రామంలో భూ సమస్యలపై సమావేశం   •  

కమనీయం.. రమనీయంగా వనదుర్గమ్మ పల్లకి సేవ

30-05-2026 08:59 PM

పాపన్నపేట: మంజీరా ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తున్న ప్రాంతం.. దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయం.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గమ్మకు ప్రతి పౌర్ణమి రోజు నిర్వహించే పల్లకి సేవ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం అట్టహాసంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వన దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఊరేగించారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఆలయ పరిసరాలు హోరెత్తాయి. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.