21 July, 2026 | 8:46 PM

ఈత వనం నాటడంతో కులవృత్తి ఎంతో ఉపయోగం

21-07-2026 05:20 PM

పర్యావరణంతో భావితరాలకు మేలు

జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ ముకుందా రెడ్డి

కామారెడ్డి,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణతో భావితరాలకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ ముకుంద రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈతవనాలను నాటారు. ఈత వనాలు పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ జీవనోపాధికి ఎంతో తోడ్పాటు అందిస్తుందన్నారు.