నేరేడుచర్ల పిహెచ్సిలో మూడు గంటల వ్యవధిలో రెండు సాధారణ ప్రసవాలు
నేరేడుచర్ల,(విజయ క్రాంతి): నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డా. పున్న నాగిని ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఒకే రోజు, కేవలం మూడు గంటల వ్యవధిలో రెండు సాధారణ ప్రసవాలను విజయవంతంగా నిర్వహించారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 12 గంటలకు నేరేడుచర్లకు ఎ. సునీత (22)అలింగపురం గ్రామం, పాలకవీడు మండలంనకు చెందిన ఆమెకు సాధారణ ప్రసవం ద్వారా 2.8 కిలోల బరువున్న మగ శిశువు జన్మించాడు. అనంతరం మధ్యాహ్నం 2.18 గంటలకు బోతలపాలెం గ్రామం పాలకవీడు మండలంనకు కు చెందిన పి. సాత్వికకు సాధారణ ప్రసవం ద్వారా 2.7 కిలోల బరువున్న మగ శిశువు జన్మించాడు.
ఉదయం నుండి పురిటి నొప్పుల తో వచ్చిన గర్భిణీ స్త్రీలకు డా.పున్న నాగిని అన్నీ తానై వైద్య పరిచర్యలు అందించి వారు సుఖ, సురక్షిత ప్రసవం అవడానిక ప్రోత్సహించారు.ఈ సందర్బంగా డాక్టర్ నాగిని మాట్లాడుతూ,రెండు ప్రసవాలు సురక్షితంగా జరగడంతో తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, 24 గంటలు ప్రసూతి, గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఒకే రోజు తక్కువ వ్యవధిలో రెండు సాధారణ ప్రసవాలను విజయవంతంగా నిర్వహించడం పీహెచ్సీ సిబ్బంది సేవా నిబద్ధతకు నిదర్శనమని స్థానికులు అభినందించారు. ఈ సందర్భంగా నర్సింగ్ ఆఫీసర్ ఉదయశ్రీ,ఏ.ఎన్.ఎమ్ భూలక్ష్మీ, ఆశా కార్యకర్తలు, ఆయా లు జ్యోతి,దేవమ్మ పాల్గొన్నారు.






