12-02-2026 12:56:33 AM
పాల్గొన్న యువ నాయకుడు ముద్దం మల్లికార్జున్ యాదవ్
సికింద్రాబాద్,ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): ఓల్ బోయిన్ పల్లి 119 డివిజన్ లో మల్లికార్జున్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 4లో బ్రహ్మకుమారి రాజయోగ మెడిటేషన్ సెంటర్ లో కుమారి ఉమా ఆధ్వర్యం లో 90వ త్రిమూర్తి శివ స్వామి జయంతి మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఓల్ బోయిన్ పల్లి 119 డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తనయుడు యువ నాయకుడు ముద్దం మల్లికార్జున్ యాదవ్ హాజరై ప్రత్యేక పూజల లో పాల్గొన్నారు. అనంతరం ముద్దం మల్లికార్జున యాదవుల ను కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఓం శాంతి కమిటీ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు బుర్రి యాదగిరి, శేఖర్ యాదవ్, చందు యాదవ్, శ్యామ్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.