16 April, 2026 | 7:34 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత: ఆరుగురు వ్యక్తుల బైండోవర్

16-04-2026 01:07 AM

కరీంనగర్ క్రైం, ఏప్రిల్15(విజయక్రాంతి): పోలీసులు గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మొగ్దూంపూర్ గ్రామానికి చెందిన మీసాల రాజు అనునతడు తన యజమాని అయినా వడ్లూరి సంపత్ యొక్క ఆదేశాల మేరకు మానేరు వాగు నుండి తీసుకొని దొంగలించి అక్రమంగా రవాణా చేస్తుండగా మొగ్దూంపూర్ గ్రామంలో కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు అట్టి ట్రాక్టర్లు సీజ్ చేసి నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి చర్య నిమిత్తం కోర్టుకు పంపించడం జరిగినది..

ఇటీవల అక్రమ ఇసుక రవాణా చేస్తూ పట్టుబడిన మానకొండూరు మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ముత్యం అజయ్, వెల్ది గ్రామానికి చెందిన నగునూరి అనిల్, సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కొత్తూరి కుమార్ , కొత్తూరు వెంకటేష్ మొగ్దుంపురు గ్రామానికి చెందిన మీసాల రాజు వడ్లూరి సంపత్లను మరొకసారి ఎటువంటి చట్టవ్యతిరేకమైన పనులు చేయకుండా కరీంనగర్ రూరల్ తాసిల్దార్ ముందు హాజరు పరిచి లక్ష రూపాయల పూచికత్తుపై బైండోవర్ చేసినట్టు ఏ నిరంజన్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ రూరల్ తెలిపారు.