14 July, 2026 | 11:29 AM

Breaking News

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ   •   విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •  

ఓటరు గణనను పరిశీలించిన టీపీసీసీ సెక్రెటరీ అమరేందర్ రెడ్డి

14-07-2026 12:00 AM

బడంగ్ పేట్  జులై 13:(విజయక్రాంతి) జిహెచ్‌ఎంసి బడంగ్ పేట్ సర్కిల్ బాలాపూర్ 62వ డివిజన్ బాలాపూర్ పాత గ్రామం బస్టాండ్ ఆవరణలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని కంటెస్టెడ్ ఎమ్మెల్యే, టిపిసిసి సెక్రెటరీ యేలిమిటి అమరేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న అమరేందర్ రెడ్డి  నిర్వహిస్తున్న బిఎల్‌ఓలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన బిఎల్‌ఎలతో మాట్లాడి, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పుల ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బిఎల్‌ఓలు, బిఎల్‌ఎలు పరస్పరం సమన్వయంతో పని చేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, ఓటర్లకు ఏ విధంగా అవగాహన కల్పించాలనే అంశంపై వారికి దిశానిర్దేశం చేశారు. అర్హులైన ఏ ఒక్కరు ఓటు కోల్పోకూడదని చెప్పారు. ఈ కార్యక్రమములో రంగారెడ్డి జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ క్యారగారి శ్రీధర్ ఎర్ర సుదర్శన్ వంగేటి మధుసూధన్ రెడ్డి, రావుల లింగం, మేకల కిరణ్, మేకల మహేందర్, చింతకింది భాను, సాయి, సాయి ముదిరాజ్, దిలీప్, కృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు.