మర్రి చెట్టుకు వేర్ల నుంచి కల్లు
బయ్యారం (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని(Bayyaram Mandal Headquarters) తహాశీల్డార్ కార్యాలయం సమీప చిన్నాలకుంట చెరువు వద్ద మర్రి చెట్టు(Banyan tree) వేరు నుండి కళ్ళు రావడం చూసి గీత కార్మికుడు నాలుగైదు రోజుల నుండి దానిని పరిశీలించగా ప్రధాన వేరు నుండి మర్రి కళ్ళు రావడానికి చూసి ఆశ్చర్యానికి లోనై వేరుకు గీత కత్తితో గీతలు పెట్టి కల్లు లొట్టిని కట్టారు. లొట్టిలో కళ్ళు పడటం చూసి పలువురు మర్రి కల్లు తాగేందుకు క్యూలు కడుతున్నారు.
ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పలువురు ఆ చెట్టును చూడటానికి వెళుతున్నారు. దీనిపై గీత కార్మికుడు ఆకుల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం మర్రిచెట్టు పక్కనే గండు పెద్ద వెంకన్న వ్యవసాయ బావి పాడుబడి పూడిక తో ఉండడంతో ఎల్ నినో ప్రభావంతో తన వరి పంటకు నీరు సరిపోక పోవడంతో ఇటీవల తన బావిని ప్రోక్లిన్ సహాయంతో పూడిక తీయించారు . పూడిక తీస్తున్న సందర్భంలో పక్కనే ఉన్న మర్రి పెద్ద వేరు తెగి పోవడం వల్ల, వేరు నుంచి మూడు నాలుగు రోజులుగా మర్రి కల్లు జాలు వారడం చూశానని తెలిపాడు. మర్రికల్లును తీసి విక్రయిస్తున్నట్లు గీత కార్మికుడు తెలిపాడు.






