17 April, 2026 | 3:25 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి

14-04-2026 12:37 AM
  1. భార్య, భర్త, కూతురు స్పాట్ డెడ్.. బాలుడికి గాయాలు
  2. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ తట్టేపల్లి వద్ద ప్రమాదం

తాండూరు, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి శివారులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తట్టేపల్లి గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న ‘టీఎస్08 నెంబర్ గల లారీ వేగంగా వచ్చి స్కూటీని ఢీకొంది. దీంతో స్కూటీపై వెళుతున్న పావని (36) ఆమె భర్త కవిరాజ్ (40) కూతురు కీర్తన(11) అక్కడికక్కడే మృతి చెందారు.

బాలుడు కార్తీక్‌కు గాయాలయ్యాయి. కార్తీక్ తల్లి శవం వద్ద చేసిన ఆక్రందనలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఘటనా స్థలానికి పెద్దముల్  ఎస్‌ఐ ప్రశాంత్ వర్ధన్ చేరుకుని బాలుడిని తాండూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్టేషన్‌కు తరలించి డ్రైవర్ మహమ్మద్ షరీఫ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.