10 June, 2026 | 6:07 PM

Breaking News

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి   •   శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం   •   ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా   •   జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి   •   రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి   •   పరిశుభ్రంగా ఉన్న గ్రామాలు ఆరోగ్యంగా ఉంటాయి: ఎమ్మెల్యే కోరం   •   బొల్లారంలో గ్రామసభ   •   లంబాడితండాలో పోలీసు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాo   •   మహిళల రక్షణకు ప్రాధాన్యత   •   అక్రిడిటేషన్ కార్డుల పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

యూరియా సరఫరాలో ఇబ్బందులు లేవు

03-01-2026 12:00 AM

మండల వ్యవసాయ అధికారి ఏ. డాకేశ్వర్  గౌడ్

చిన్నంబావి, జనవరి 2 : మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను శుక్రవారం నాడు మండల వ్యవసాయాధికారి ఏ. డాకేశ్వర్ గౌడ్ తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైనంత యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని అవసరం లేదన్నారు. మండలంలో యాసంగికి సాగు చేసే పంటల విస్తీర్ణాన్ని బట్టి మండలానికి 1850 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.

రైతులు తమ పట్టాదారు పాసు బుక్కు, ఆధార్ కార్డు తో యూరియా బస్తాలు పొదవచ్చని, యూరియా సరఫరా అనేది నిరంతర ప్రక్రియ కావున రైతులు సింగిల్ విండో సొసైటీ, ఆగ్రో సెంటర్స్ మరియు ప్రైవేట్ ఎరువుల దుకాణాలలో  తీసుకోగలరు. ఫర్టిలైజర్ డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.