30 March, 2026 | 8:50 PM

భర్తను చంపిన భార్య

09-10-2025 12:00 AM

-మద్యం మత్తులో జరిగిన గొడవే కారణం

కొండపాక, అక్టోబర్ 8: మద్యం మత్తులో భార్యతో తరచూ గొడవపడే మహేందర్‌ను భార్య సంతోష, ఆమె తమ్ముళ్లు, కొడుకులు, పరిచయస్తులతో కలిసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తాగి స్పృహ తప్పి పడుకున్న మహేందర్‌ను ఆటోలో తీసుకెళ్లి కాళ్ళు తువ్వాలా తో కట్టేసి నడుముకు బండ రాయిని కట్టి కూడవెల్లి వాగులో పడవేశారని కుక్కునూరుపల్లి పోలీసులు తెలిపారు. ఈ కేసును చేదించిన సీఐ, ఎస్‌ఐ ని, కానిస్టేబుల్ లను ఏసీబీఅభినందించారు.