12 March, 2026 | 2:37 PM

Breaking News

బీఆర్ఎస్‎కు షాక్ .. సుప్రీంలో ముగిసిన పార్టీ ఫిరాయింపుల కేసు   •   మళ్లీ తెరపైకి మద్యం కేసు.. కవిత ఇంటికి సీబీఐ అధికారులు   •   నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌కు వచ్చిందంటే.. హాలీవుడ్ వచ్చినట్లే   •   భారత్‌కు ఊరట.. ఆయిల్ ట్యాంకర్లకు ఇరాన్ అనుమతి   •   అమెరికా ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి   •   పోలీస్ భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య.. సూసైడ్ నోట్‍లో సంచలన విషయాలు   •   పెళ్లికి వెళ్తుండగా వాహనం బోల్తా.. ఇద్దరు మృతి   •   రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి   •   గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి   •   గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలి   •  

రాజ్యాంగాన్ని ఖననం చేసిన స్పీకర్

12-03-2026 12:26 AM

చండూరు, మార్చి 11 : ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుల కేసులో బుధవారం శాసనసభ స్పీకర్ క్లీన్ చీట్ ఇవ్వడం చూస్తే రాజ్యాంగాన్ని ఖననం చేసినట్లుగా ఉన్నదని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమన్నారు.

ఎమ్మెల్యేలు బిఆర్‌ఎస్ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, 6 నెలల్లోనే పార్టీ మారి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఎన్నికల కమిషన్ అందజేసిన బీ ఫారం ఉన్నదన్నారు. అలాగే రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారని ఇంత నగ్నసత్యం కళ్లెదుటే ఉన్నా, అది ‘పార్టీ ఫిరాయింపు‘ కాదని స్పీకర్ తీర్పునివ్వడం విస్మయం కలగజేస్తుందన్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి తరపున ప్రచారం చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పూర్తిగా అన్యాయమని అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన ’పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని’ ఈరోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంత బహిరంగంగా ఉల్లంఘిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమి సమాధానం చెబుతారన్నారు. ఈ తీర్పు రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి తీరని అవమానమని దీన్ని భారతీయ జనతా యువ మోర్చా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.