2 July, 2026 | 11:38 AM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

తొలి రోజు సెట్ ప్రశాంతం

23-12-2025 12:14 AM
  1. రెండు సెషన్స్ కలిపి 15,705 మంది దరఖాస్తు
  2. మంగళ, బుధవారాల్లో కూడ పరీక్ష నిర్వహణ

హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): తెలంగాణ స్టేట్ ఎలి జిబిలిటీ టెస్ట్ (టీజీ సెట్) తొలి రో జు పరీక్షను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించినట్లు ఉస్మాని యా యూనివర్సిటీ అధికారులు తెలిపారు. సోమవారం వర్సిటీ ప్రాంగణంలోని టీజీ సెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వీసీ ప్రొ ఫెసర్ కుమార్ మొలుగరం ఉద యం 8.30 గంటలకు పరీక్ష పాస్‌వర్డ్ విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షను ప్రారంభించారు.

తొలి రోజు రెండు సెషన్‌లో కలిపి 15,705 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 23, 24న కూడా పరీక్షలు జరగనున్నాయి. అయితే పరీక్షలకు హాజరైన అభ్యర్థుల పూర్తి వివరాలు అన్ని పరీక్షలు ముగిశాక ప్రకటిస్తామని ఓ సెట్ అధికారి తెలిపారు. అన్ని పరీక్షలకు కలిపి మొ త్తం 45,127 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.