4 May, 2026 | 4:06 PM

Breaking News

చరిత్ర సృష్టించిన విజయ్.. దళపతి ప్రస్థానం ఇదే..!   •   మంత్రి శ్రీధర్ బాబుకు శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వానం   •   డంపింగ్ యార్డును తరలించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి   •   సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్   •   అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •  

గ్రామాల అభివృద్ధికే ప్రగతి ప్రణాళిక

16-03-2026 12:17 AM

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ 

ఉట్నూర్, మార్చి 15, (విజయక్రాంతి): మారుమూల గ్రామాల అభివృద్ధి కోసం ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక.. 99 రోజుల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం ఉట్నూర్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ  కార్మికులను సన్మానించారు.  అనంతరం సర్పంచ్ అనిత జాద వ్‌తో కలిసి పాత బస్టాండ్ ప్రాంతంలో మరుగుదొడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేసి, పనులు ప్రారంభించారు.  ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గ్రామ పంచాయతీ కార్మికుల సేవలు అమోఘమని గుర్తు చేశారు.

పంచాయతీ కార్మికులు ఉదయం లేవగానే వారికి కేటాయించిన వార్డులను శుభ్రం చేయడంతో పాటు మురికికాలువలు శుభ్రం చేస్తూ, ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా నిత్యం పని చేస్తున్నారని గుర్తు చేశారు. చెత్తను ఎక్కడబడితే అక్కడ పడేయకుండా గ్రామ పంచాయతీ వారు ఏర్పాటు చేసిన  కుండీల లో చెత్తని వేయాలని సూచించారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.