దూడపై గుర్తుతెలియని జంతువు దాడి
29-06-2026 03:10 PM
జనగామ, జూన్ 29 (విజయక్రాంతి): జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామానికి చెందిన వంగపల్లి నర్సాయ్య తండ్రి బాలయ్య తన బావి వద్ద దుడ్డెపై గుర్తుతెలియని జంతువు దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంబంధిత అధికారులకు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.






