28 March, 2026 | 4:31 PM

Breaking News

సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •   ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపికలు   •   ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి   •   'తొలి ముద్ద'.. బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభం.. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం   •   కిషన్ రావుపేటలో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన   •   కూసుమంచి తహాశీల్దారుగా సైదులు బాధ్యతలు స్వీకరణ   •   ఘనంగా రావి వీరవేన్లయ్య 34 వర్ధంతి   •  

పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగించే పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలి

26-03-2026 12:37 AM

టెక్మాల్, మార్చి 25 : కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వాలిడిషన్ చట్టం 2025 తక్షణమే రద్దు చేయాలని విశ్రాంతి ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షులు నా రయణ అన్నారు.  బుధవారం ఆ సంఘం ఆద్వర్యంలో టేక్మాల్ త హసీల్దార్ కార్యలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్మార్ తులసీరాంకు వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనవరి ఒకటి 2026 కంటే ముందు ఉద్యోగ విరమణ పొందిన వారిని, ఆ తర్వత విరమణ పొందిన పెన్షనర్లను వేర్వేరుగా విభజించడం సరికదన్నారు. గతంలో ఇస్తూ వచ్చిన వేతన సవరణలు (పిఆర్సీ), కరువు భత్యం (డీఏ) పెంపుదలలు ఇక పై ఉండవని పేర్కోనడం పెన్షనర్ల జీవితలను దెబ్బతీయడమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి శంకర్ రావు , నర్సింలు, ఆశోకిరెడ్డి, ధనుంజయ్య, రాజు, శివలింగప్ప తదితరులుఉన్నారు.