28 March, 2026 | 5:34 PM

Breaking News

మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •   సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •   ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపికలు   •   ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి   •  

వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్

28-03-2026 04:05 PM

గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని తై బజార్ వేలంలో భారీ ధర పలికింది. శనివారం నాడు ఉదయం గాంధారి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ మమ్మాయి రేణుకా యాదవ్ అధ్యక్షతన 2026-27 సంవత్సరానికి గాను తై బజార్, దాఖల చిట్టి వేలం నిర్వహించారు.

ముందుగా  తై బజార్ వేలంలో నలుగురు పాల్గొనగా మండల కేంద్రానికి చెందిన గడ మురళి రూ.9.10 లక్షలకు పాట పాడి వేలంలో తై బజార్ దక్కించుకున్నాడని పంచాయతీ కార్యదర్శి నాగరాజు తెలిపారు. అనంతరం దాఖలా చిట్టి వేలంలో అయిదుగురు పాల్గొనగా చివరికి రూ.4.32 లక్షలకు వాడే శ్రీధర్ దక్కించుకున్నట్టు ఆయన తెలిపారు.