కూసుమంచి తహాశీల్దారుగా సైదులు బాధ్యతలు స్వీకరణ
28-03-2026 03:50 PM
కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి నూతన తహాశీల్దారుగా సైదులు శనివారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో రెవెన్యూ సిబ్బంది స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు పనిచేసిన తహసీల్దార్ రవికుమార్ బదిలీపై వెళ్ళారు. ఆయన స్థానంలో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ గా పనిచేస్తున్న సైదులను కూసుమంచికి బదిలీ చేయగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ భూభారతి పథకానికి కూసుమంచి మండలంను ఎంపిక చేయడం సంతోషంగా ఉందని, సిబ్బంది అందర్ని కలుపుకుని కచ్చితంగా రైతులు మేలు జరిగే విధంగా పనిచేస్తామని హామి ఇచ్చారు.




