30 March, 2026 | 12:25 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగాలి

01-12-2025 04:47 PM

మఠంపల్లి: సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలంలో బుధవారం నుంచి మూడవ విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలని మఠంపల్లి తహశీల్దార్ లావురి మంగా తెలిపారు. సోమవారం మండలంలోని నామినేషన్ కేంద్రాలను మండల అభివృద్ధి అధికారి జగదీష్, సబ్ ఇన్స్పెక్టర్ బాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నామినేషన్ స్వీకరణ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు మరో ఇద్దరినీ మాత్రమే అనుమతించాలని, అలాగే వాహనాలు 100 మీటర్ల దూరంలోనే ఆపేయాలని ఆదేశించారు. అభ్యర్థులకు నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి సందేహాలు ఉన్న హెల్ప్ డెస్క్ ద్వారా నివృత్తి చేసుకోవాలని, ఏలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా అధికారులు విధులు నిర్వహించాలని సూచించారు.