4 May, 2026 | 3:53 AM

నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి

04-05-2026 02:39 AM

మునిపల్లి, మే 3 : మునిపల్లి మండలం పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు మల్లేశంగౌడ్ కుమార్తె వివాహం సంగారెడ్డి జిల్లా కంది గ్రామ శివారులోని ఎల్.ఎన్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.