18 July, 2026 | 1:37 PM

Breaking News

కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కేటీఆర్‌ సవాల్‌   •   Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •  

ప్రమాదాలను అరికట్టడమే ప్రధాన లక్ష్యం

17-11-2025 12:00 AM

అలంపూర్, నవంబర్ 16: రోజు రోజుకి జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే ప్రధాన లక్ష్యమని బీఆర్‌ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు మహేష్ నాయుడు అన్నారు.అలంపూర్ మండల పరిధిలోని లింగన్నవాయి గ్రామం నుండి ఇమాంపురం వరకు ఉన్న బీటీ రోడ్డు కు ఇరువైపులా ముళ్ళ లను ఆదివారం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో తన సొంత ఖర్చులతో జెసిబి ద్వారా ముళ్ళ పొదలను తొలగించడం  జరిగింది.

ఈ సందర్భంగా మహేష్ నాయుడు మాట్లాడుతూ.. రోడ్డుకిరువైపులా ముళ్ళపొదలు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనపడక ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రయాణికులు, గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులే కాక, రోజు రోజు కు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామీణ అభివృద్ధికై పాటుపడుతున్న మహేష్ నాయుడుకు గ్రామీణ ప్రజలు, ప్రయాణికులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, మల్లికార్జున, చైతన్య యాదవ్, ఎల్‌ఐసి మద్దిలేటి, బాలరాజు, జగన్, మరియు పంచాయతీ సిబ్బంది రఘు తదితరులు పాల్గొన్నారు.