10-02-2026 02:03:47 AM
లాహోర్, ఫిబ్రవరి 9 : సందిగ్ధతకు తెరపడింది. టీ20 ప్రపంచకప్లో భారత్, పాకి స్థాన్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరగబోతోంది. పీసీబీ, ఐసీసీ మధ్య సుధీర్ఘ చర్చల తర్వాత మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ అంగీకరించినట్టు తెలుస్తోంది.
అయితే ఈ మీటిం గ్లో ఐసీసీ ముందుకు పాక్ బోర్డు పలు కం డిషన్లు తీసుకొచ్చింది. తమకు వచ్చే రెవె న్యూ వాటా పెంచడం, భారత్,బంగ్లాదేశ్, పా కిస్థాన్ జట్లతో ట్రై సిరీస్ నిర్వహించడం, నో షేక్ హ్యాండ్ మూమెంట్కు స్వస్థి పలకడం ఇలాంటి షరతులు పెట్టింది.
దీనిపై ఐ సీసీ ధీటుగానే బదులిచ్చినట్టు సమాచారం. భారత్తో ట్రై సిరీస్ పూర్తిగా బీసీసీఐ ఇష్టమని తేల్చేసింది. అలాగే నో షేక్ హ్యాండ్ అంశం విషయంలోనూ తాము ఎలాంటి జోక్యం చే సుకోబోమని తెలిపింది. ఇదిలా ఉంటే బం గ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా భారత్తో మ్యాచ్ ఆడమంటూ పాక్ బోర్డుకు రిక్వెస్ట్ పెట్టింది. మరోవైపు వరల్డ్కప్ నుంచే తప్పుకున్న బం గ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.