2 July, 2026 | 4:38 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

14-04-2026 12:40 AM

ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించిన గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు 

కూసుమంచి, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రజలందరికి మెరుగైన, నాణ్యమైన వైద్యాన్ని అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు గ్రామంలో ఖమ్మం గ్రానైట్ మార్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు సోమవారం ప్రారంభించారు..

ఈ సందర్భంగా రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యమే ప్రధానమని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..పేద ప్రజలు నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మంచి వైద్యాన్ని అందించేందుకు ముందుకు వచ్చిన నిర్వాహకులను అభినందించారు.