07-02-2026 12:27:36 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఫిబ్రవరి 6: ఈనెల 20న మండల కేంద్రం అర్వపల్లిలో జరిగే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 9వ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఆ సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉదయగిరి,కాంచనపల్లి సైదులు కోరారు.శుక్రవారం మండల కేంద్రం అర్వపల్లిలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీడిత ప్రజల పక్షాన గళం విప్పుతూ,దోపిడీ,పీడన,అసమానత,అణిచివేతలపై తమ కళారూపాలను ఆయుధంగా ఎక్కుపెట్టి అరుణోదయ సమాఖ్య ముందుకు వెళుతుందని అన్నారు.
ఈ నెల 20న జరిగే మహాసభకు ప్రజా కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర నాయకులు తడకమల్ల సంజీవ్,జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర ఉమేష్,జిల్లా ఉపాధ్యక్షుడు బెల్లి వెంకన్న,కోశాధికారి నాగేష్,నర్సిరెడ్డి పాల్గొన్నారు.