31 March, 2026 | 4:20 PM

Breaking News

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి   •   దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   హిందూ సమ్మేళనం కరపత్రం విడుదల   •   వైద్యులపై దాడులు చేయడం సరికాదు   •   ఉద్యోగాలపై సీఎం చెప్పేవి కాకి లేక్కలే.. బడ్జెట్ పత్రాలు అందుకే చింపాం..!   •   పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు సన్మానం   •   రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత   •   రవీంద్ర భారతి హై స్కూల్‌లో ప్రత్యేక సర్టిఫికెట్‌ల పంపిణీ కార్యక్రమం   •   అమీర్‌పేట నీటి సమస్యలపై తక్షణ స్పందన   •   యుద్ధానికి కాలపరిమితి లేదు — జెరూసలెంలో పేలుళ్లు, ఇస్ఫాహాన్‌పై బంకర్ బస్టర్ బాంబులు!   •  

టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ BJP లో చేరారు — మమతకు షాక్!

31-03-2026 02:40 PM

కోల్‌కతా: రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, భారత టెన్నిస్ దిగ్గజం లీండర్ పేస్(Tennis Star Leander Paes Joins BJP) మంగళవారంనాడు భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. 2021లో తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో చేరిన పేస్, జాతీయ రాజధానిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో లాంఛనంగా పార్టీ మారారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, సుకాంత మజుందార్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.

బెంగాల్ ఎన్నికల(West Bengal Elections) నేపథ్యంలో లియాండర్ పేస్ చేరికతో బీజేపీకి మరింత బలం, మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలినట్లు అయిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రానున్న బెంగాల్ ఎన్నికలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీ గట్టి ప్రయత్నం చేస్తోంది. మమత ప్రభుత్వంపై ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి మంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తున్నారు.