సోమవారం ప్రజావాణి తాత్కాలిక రద్దు
25-07-2026 04:05 PM
సిద్దిపేట కలెక్టరేట్,జూలై 25: సిద్దిపేట ఐడీఓసీ సమావేశ మందిరంలో ఈ నెల 27న నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె.హైమావతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం జనాభా లెక్కలు, భూముల రీసర్వేకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి 27న ప్రజావాణి కోసం ఐడీఓసీకి రావద్దని,తదుపరి సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ సూచించారు.






