19 May, 2026 | 11:26 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ

09-12-2025 07:45 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కలెక్టరేట్లలో నేడు తెలంగాణ తల్లి విగ్రహాలు(Telangana Talli Statues) ఆవిష్కరణ జరగనుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు వర్చువల్ గా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించనున్నారు.  రూ. 5.8 కోట్లతో 33 జిల్లాల్లోని కలెక్టరేట్లలో 18 అడుగుల ఎత్తయిన తెలంగాణ తల్లి విగ్రహాలను నిర్మించారు. ఇవాళ 27 కలెక్టరేట్ల ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరించనున్నారు. మిగతా 6 జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్,  ములుగు, నల్గొండ, నారాయణపేట జిల్లాల్లో  విగ్రహాల నిర్మాణం  పూర్తి కాలేదని అధికారులు పేర్కొన్నారు.