మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా తెలంగాణ
- అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు అవసరం
- సీఎం రేవంత్రెడ్డితో అడోబ్ సీఈవో శంతను నారాయన్ భేటీ
- ఏఐ రెవల్యూషన్, భవిష్యత్లో సమర్థవంతంగా ఏఐ వినియోగంపై చర్చ
- తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు మరింత సహకరించాలి
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాం తి): తెలంగాణను మాన్యుఫ్యాక్చరింగ్ పవర్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూ చించారు. ఇందుకు కొన్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిచాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. బుధవారం జూబ్లీహిల్స్లో సీఎం నివాసంలో అడోబ్ సీఈవో, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ బోర్డు సభ్యులు శంతన్ నారాయణ్ సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకం గా కలిశారు.
గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలపై ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలపై ఈ సం దర్భంగా సీఎంతో శంతను నారాయణ్ చర్చించారు. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్ అండ్ రీ స్కిల్లింగ్కు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎకానమీపై ఏఐ రెవల్యూషన్ ప్రభావం, రాబో యే రోజుల్లో ఏఐని సమర్ధవంతంగా వినియోగించుకునే అంశాలపై శంతను నారా యణ్తో సీఎం చర్చించారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిం చేం దుకు మరింత సహకరించాలని ఈ సందర్భంగా సీఎం కోరారు.




