1 July, 2026 | 9:01 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఉపాధ్యాయులు డిజిటల్ లెర్నింగ్ తో బోధన చేయాలి

08-10-2025 07:24 PM

మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్..

హుజూర్ నగర్: విద్యార్థులకు ఉపాధ్యాయులు డిజిటల్ లెర్నింగ్ తో బోధన చేయాలని హుజూర్ నగర్ మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ అన్నారు. గురువారం పట్టణంలోని శ్రీ గురుకులం పాఠశాలలో డివిజన్ పరిధిలోని గణిత, భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులకు డిజిటల్ లెర్నింగ్ బోధనపై మూడు రోజులపాటు శిక్షణను ప్రారంభించారు. ఈ శిక్షణలో ఉపాధ్యాయులను ఉద్దేశించి మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ మాట్లాడుతూ... ఉపాధ్యాయులందరూ ఇప్పటి పరిస్థితికి అనుగుణంగా విద్యార్థులకు డిజిటల్ బోధనతో అభ్యసన కార్యక్రమాన్ని అందించాలని సూచించారు. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా మెరుగుపరుచుకుని అభ్యసనలో బోధనలో వినియోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి బీరెల్లి శ్రీనివాసరెడ్డి, రిసోర్స్ పర్సన్లు షేక్ జాఫర్, సిఆర్పిలు సైదులు, బ్రహ్మం, ప్రభుత్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.