18 July, 2026 | 6:10 PM

Breaking News

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •   సర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి   •   విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన మాక్‌ పోలింగ్‌   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ   •  

పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించాలి

23-12-2025 12:00 AM

రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యుడు చారగొండ వెంకటేష్ 

కల్వకుర్తి టౌన్, డిసెంబర్ 22 : పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించాలని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేష్ అన్నారు.  సోమవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణిత దినోత్సవం సందర్భంగా, విద్యార్థులకు నిర్వహించిన మిత్ర జనరల్ నాలెడ్జ్ మెగా టెస్ట్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. గణితంలో శ్రీనివాస రామానుజన్ చేసిన కృషిని విద్యార్థులకు వివరించారు.

ప్రతి ఒక్కరు వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన మేధావులను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మెగా నాలెడ్జ్ టెస్టులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, మిత్ర ఫౌండేషన్ ఫౌండర్ చంద్రకాంత్ రెడ్డి, మిత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ నేత, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.