19 March, 2026 | 4:35 PM

నవోదయ ప్రవేశ పరీక్షలో మెల్లకుంట తండా విద్యార్థి ప్రతిభ

18-03-2026 12:00 AM

నాగిరెడ్డిపేట్, మార్చి 17 (విజయ క్రాంతి):జవహర్ నవోదయ విద్యాలయం ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో నాగిరెడ్డిపేట్ మండలం మెల్లకుంట తండాకు చెందిన కొర్ర నిహాల్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సీటు సాధించాడు.

నిహాల్ గిరిజన వర్గానికి చెందిన కొర్ర వసేందర్ కుమారుడుకాగా,కొర్ర వర్జ నాయక్ మనుమడు.సాధారణ గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన ఈవిద్యార్థి సాధించిన విజయం కుటుంబసభ్యులతో పాటు గ్రామ ప్రజల్లో ఆనందాన్ని నింపింది.నిహాల్ విజయంపై తండా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. అతని సాధన గ్రామానికి మంచి గుర్తింపు తీసుకువచ్చిందని పేర్కొన్నారు.