అధ్యాపకుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ కళాశాల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం నిర్మల్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన డాక్టర్ కె.రఘునాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన కట్ట రమేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల అధికారిగా డాక్టర్ జె. భీమరావు వ్యవహరించారు. నూతన కార్యవర్గ సభ్యులను ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ యూ. గంగాధర్ తో పాటు నిర్మల్, భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు సూర్యసాగర్, రవికుమార్, సుభాష్, అర్చన, శంకర్, శ్రీహరి, శ్రీనివాస్, దిలీప్ లు నూతన కార్యవర్గాన్ని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.






